కాన్బెరా : టీ మీండియా , ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ సందర్భంగా టాస్లో నెగ్గిన ఆసీస్ కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇదివరకే 2-1తో వన్డే సిరీస్ నెగ్గిన ఆ జట్టు ఇప్పుడు టీ 20పై కన్నేసింది. మరోవైపు మూడో వన్డేలో గెలుపొందిన భారత్ ఈ మ్యాచ్లో బోణీ కొట్టి తర్వాతి టీ20లపై పట్టు నిలుపుకోవాలని ఆశిస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తోన్నాయి. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్ రాహూల్ 40 బంతుల్లో 51 రన్స్ చేశారు. టీ20పై క్రీడాభిమానులకు ఆద్యంతం ఆసక్తి నెలకొన్నది.
భారతజట్టు: కేఎల్రాహూల్, శిఖర్ధావన్, విరాట్కోహ్లీ, మనీష్పాండే, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య , రవీంద్ర జడేజా , వాషింగ్టన్సుందర్, దీపక్ చాహర్, నటరాజన్, షమీ
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ఫించ్(కెప్టెన్) డిఆర్కీషార్ట్, మాథ్యూవేడ్, స్టీవ్స్మిత్, మాక్స్వెల్,హెన్రిక్స్ , సీన్ అబోట్, మిచెల్స్టార్క్, మిచెల్ స్వీప్సన్, ఆడంజంపా, జోష్ హాజిల్వుడ్