సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో విజయం ద్వారా ఫామ్లోకి వచ్చిన టీమిండియా తొలి టీ20లో తన ప్రతాపం చూపింది. అయితే మూడు టీ20 సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా రెండో మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది. కాగా కోహ్లీసేనపై పైచేయి సాధించి రేసులో నిలవాలని ఆసీస్ భావిస్తోంది. అయితే ఈ రెండు జట్లమధ్య జరిగే ఉత్కంఠ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఆరోన్ ఫించ్ లేకపోవడంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ వ్వవహరిస్తున్నాడు.
జట్టువివరాలు:
భారత్: ధావన్ ,కేఎల్రాహూల్, విరాట్కోహ్లీ(కెప్టెన్), సంజుశాంసన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, సుందర్, దీపక్ చాహర్, నటరాజన్, చాహల్ ,శార్ధూల్
ఆస్ట్రేలియా: షార్ట్, స్టాయినిస్, స్టీవ్స్మిత్, హెన్రిక్స్, గ్లెన్మాక్స్వెల్, మాథ్యూవేడ్(కెప్టెన్), డేనియల్ సామ్స్, అబాట్, ఆండ్రూటై. స్వెప్సన్, జంపా