నోముల పార్థివదేహానికి సీఎం కేసీఆర్​ నివాళి

నోముల పార్థివదేహానికి సీఎం కేసీఆర్​ నివాళినల్లగొండ జిల్లా : నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్​ ఘనంగా నివాళుర్పించారు. గురువారం నోముల అంత్యక్రియలు ఆయన స్వగామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్​ మండలంలోని పాలెం గ్రామంలో ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించారు. ఉదయం 11 :30 గంటలకు పాలెం చేరుకున్న సీఎం కేసీఆర్​ నర్సింహయ్య భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతంర కుటుంబ సభ్యులకు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. సీఎం కేసీఆర్​ వెంట మంత్రులు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.