కాన్బెర్రా : టెస్టు సిరీస్లో రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగాలంటే భారత్కు టీ20 సిరీస్ విజయం తప్పనిసరి. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీసేన ఆధ్వర్యంలో ప్రదర్శన గొప్పగానే సాగుతోంది. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగిస్తే సిరీస్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీకాదు. గత పది టీ20ల్లో టీమిండియా ప్రదర్శన బాగానే ఉంది. కానీ జట్టులో మంచి ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్కు దూరమవ్వడం, ఆటగాళ్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం కాస్తా ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సొంతగడ్డపై సిరీస్ చేజార్చుకోవద్దని ఆసీస్ ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సిరీస్ ఎవరు చేజిక్కుంచుకంటారోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.