హైదరాబాద్ పరిస్థితి మార్చేందుకే వచ్చా..గ్రేటర్ ఎన్నికల ప్రచారం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షా
హైదరాబాద్: హైదరాబాద్ను నిజాం కల్చర్ నుంచి మార్చి కొత్త నగరంగా నిర్మిస్తామని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షా అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన హైదరాబాద్కు వచ్చారు. ముందుగా పాతబస్తీలో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన రోడ్షో ద్వారా నాంపల్లిలో బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇస్తే వరద ప్రవాహానికి అడ్డుగా ఇళ్లను తొలగిస్తామన్నారు. హైదరాబాద్లో ఇళ్లలోకి నీరు రావడానికి కేసీఆరే కారణమన్నారు. వరద ప్రవాహానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. గుడ్ గవర్ననేన్స్ అమలుచేసి హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఐదేళ్లు పూర్తైనా ప్రజలకు ఏంచేశావో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సిటిజన్ ఛాప్టర్ ఏమైంది లక్ష ఇళ్లు ఏమయ్యాయో..మూసినదీపై ఆరులైన్ల రోడ్డు ఏమైందో, పదివేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశావో చెప్పాలన్నారు. ఉస్మానియా,గాంధీపై భారం తగ్గించేందుకు నాలుగు దవాఖానలు కడతానన్నవు ఎక్కడా కట్టావో చెప్పాలన్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా పేదలకు కార్పొరేట్ వైద్యం కేసీఆర్ దూరం చేశారన్నారు. ప్రధాని మోడీ ఏం చెప్తే అది చేస్తారన్నారు. జాతీయ రహదారులు నిర్మించామన్నారు. పీఎం స్ట్రీట్ వెండర్ యోజన స్కీం ద్వారా మూడు లక్షలమంది లబ్ధి చేకూర్చామన్నారు. స్టార్టప్ కోసం ప్రత్యేక నిధలు ఇచ్చిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. మజ్లిస్తో కలిస్తే మాకు ఏం ఇబ్బంది ఉండదన్నారు. బీజేపీ అనేక రాష్ట్రాలో నగరాల్లో అధికారంలో ఉందన్నారు. కేసీఆర్ సచివాలయానికి చాలా ఏళ్లుగా వెళ్లలేదు అందుకే సీఎంకు లెక్కలు తెలియవని షా ఎద్దేవా చేశారు . బీజేపీ వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తుందన్నారు. ఒక్కసారి అవకాశం వస్తే రోహింగ్యాలను ఎలా తరిమికొడతామో చూడాలన్నారు. ఏ ఎన్నికలను పార్టీ ఈజీగా తీసుకోదన్నారు. గల్లీసాబ్ చేయనందుకే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలో ఫోన్ట్యాపింగ్పై విచారణ చేస్తామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదిరులు ఉన్నారు.