ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. శుక్రవారం సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుతుండగా జరిగిన గొడవ ఈ ఘటనకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. క్రికెట్ ఆటలో జరిగిన గొడవతో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ సంయమనం కోల్పోయి తన గన్, తల్వార్తో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో మోసిన్ అనే యువకుడికి బుల్లెట్ గాయమైంది. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి రివాల్వర్, తల్వార్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.