అమరావతి : టీడీపీలో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శకులకు పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించి ఒక్కొక్కరికి ఐదు లోక్సభ నియోజకవర్గాల చొప్పున ఐదుగురికి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అరకు బాధ్యతలు, పంచుమర్తి అనురాధకు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, ఏలూరు , బత్యాల చెంగల్రాయుడికి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల , ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట , మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డికి కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల , దేవినేని ఉమకు భావసారూప్య గల ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయ బాధ్యతలు, పయ్యావుల కేశవ్కు అధికార ప్రతినిధులపై పర్యవేక్షణ , ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామికి 25 లోక్సభ స్థానాల నుంచి వచ్చే నివేదికలు పరిశీలించే బాధ్యతను చంద్రబాబు అప్పగించారు.