తెలంగాణ మంత్రికి కరోనా

తెలంగాణ మంత్రికి కరోనాహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ కరోనా బారిన పడ్డారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో​ తనకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు మంత్రి పువ్వాడ వెల్లడించారు. హైదరాబాద్​లోని తన ఇంటిలో ఐసోలేషన్​లో ఉన్నట్లు మంత్రి వివరించారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్​ కోరారు. కరోనా నుంచి త్వరగా కోలుకుని ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. తనను కలువడానికి గాని, ఫోన్​ చేయడానికి గాని ఎవరూ ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేశారు.