గ్రేటర్ పీఠం పై గులాబీ జెండా ఎగురవేస్తాం: గంగుల

గ్రేటర్ పీఠం పై గులాబీ జెండా ఎగురవేస్తాం: గంగులకరీంనగర్​ జిల్లా: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 పైగా సీట్లు గెలుచుకుని గ్రేటర్​ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. ఏ పార్టీతో పొత్తుల అవసరం లేకుండా మేయర్ స్థానం గెల్చుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్​ గుండెకాయవంటిదన్నారు. ఎవరితో పొత్తు లేకుండా ఎక్స్ ఆఫీషియో ఓట్లు కూడా అవసరం లేకుండా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్​ఎస్​పై బీజేపీ చేస్తున్న తప్పుడు అరోపణలు మానుకుంటే మంచిదన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. ఆరేళ్లలో ఎన్నో మల్టీ నేషన్​లు కంపెనీలు హైదరాబాద్​కు వచ్చాయని మంత్రి చెప్పారు. గ్రేటర్​ ప్రజలు ప్రశాంతతను కోరుకున్నారు కాబట్టే టీఆర్​ఎస్​ వైపు మొగ్గు చూపారని అన్నారు.