హైదరాబాద్: ప్రజాకవి, ప్రముఖ వాగ్గేయకారుడు , ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కుమార్తె వివాహం శుక్రవారం హైదరాబాద్ నాగోల్లోని ఓప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం సీఎం కేసీఆర్ ఈ వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఈ వివాహ వేడుకలకు మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ రాములు, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, దర్శకులు ఆర్ నారాయణమూర్తి, నాయకులు హాజరయ్యారు.