బెంగుళూరు : గోవధ నిషేధ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాకట శాసనమండలి సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి డిప్యూటీ చైర్మన్ భోజెగౌడను కుర్చీలో నుంచి లాగారు. బీజేపీ మండలి చైర్మన్ కే ప్రతాపచంద్ర శెట్టిపై ఆవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో అధికార, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆయన సభకు వచ్చే ముందు జేడీఎస్కు చెందిన ఎమ్మెల్సీ, డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడను చైర్మన్ సీటులో కూర్చోబెట్టారు. దీంతో రాజ్యాంగం ప్రకారం ఆయనకు చైర్లో కూర్చునే అర్హత లేదని తమ పార్టీకి చెందిన చంద్రశేఖర్ పాటిల్ను ఆస్థానంలో కూర్చోబెట్టాలని వాదనకు దిగారు. అనంతరం ధర్మేగౌడను కుర్చీలో నుంచి లాగారు. ఈ క్రమంలో మండలిలోకి వచ్చిన చైర్మన్ ప్రతాపచంద్రశెట్టి సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈనెల 7 నుంచి తిరిగి మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.