హైదరాబాద్ : ఆహార పదార్థాలలో డ్రగ్స్ను రవాణా చేస్తున్న ముఠాను శనివారం డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్కు సరఫరా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు అధికారులు ఎయిర్పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ను సరఫరాను చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. కిలోకి పైగా మెథమెటమిన్ డ్రగ్గా గుర్తించినట్లు తెలిపారు. ఫుడ్ ఐటమ్లో కలిపి తీసుకునే ఈ మత్తు పదార్థం అత్యంత ప్రమాదకరమైనదిగా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటుందని తెలిపారు. ఫుడ్ మెటీరియల్ చాటున సరఫరా అవుతున్న ఈ డ్రగ్స్ వ్యవహారంపై విచారణ చేపడుతామన్నారు.