నాగర్కర్నూలు జిల్లా : జిల్లాలోని పర్యాటక ప్రదేశాలకు సంబంధించి అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నల్లమల లఘుచిత్రాన్ని శనివారం నాగర్కర్నూల్ కేసరి సముద్రం ట్యాంకుబండ్పై కెమెరా స్విచ్ ఆన్ చేసి కలెక్టర్ శర్మన్ ప్రారంభించారు. జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను ప్రజలకు చేరువ చేసేలా లఘుచిత్రాన్ని చిత్రీకరించాలని దర్శకుడికి కలెక్టర్ సూచించారు. జిల్లాలోని సుందరమైన ప్రదేశాలను పర్యాటకులు సందర్శించే విధంగా షూటింగ్ జరుపాలని కోరారు.