తెలంగాణలో టీఆర్​ఎస్​ బలమైన పార్టీ: అసదుద్దీన్​

తెలంగాణలో టీఆర్​ఎస్​ బలమైన పార్టీ: అసదుద్దీన్​హైదరాబాద్​: కేసీఆర్​ బలమైన నాయకుడని తెలంగాణలో టీఆర్​ఎస్​ బలీయమైన రాజకీయ పార్టీ అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ అన్నారు. గ్రేటర్​ ఎన్నికల్లో తమ పార్టీకి గతంలో కన్నా మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. తెలంగాణలో‘ బీజేపీ తుఫాన్​’ వాదనలను ఆయన తోసిపుచ్చారు. తుఫాన్​ ఉంటే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయేది కాదని ఒవైసీ చెప్పారు. బీజేపీ గెలిపించేందుకు హైదరాబాద్​లో అమిత్​షా, యోగి ఆదిత్యనాథ్​ను తీసుకువచ్చి హైదరాబాద్​లో ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఓటమి పాలైందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ఫలితాలపై పార్టీ అధినేత కేసీఆర్​ సమీక్షించి రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతంగా మారుస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే మేయర్​ పీఠంపై తాము కింగ్​ మేకర్​ అని అనుకోవడంలేదని అన్నారు. ఈవిషయం టీఆర్​ఎస్​ పార్టీ ఇప్పటివరకు తమతో సంప్రదించలేదని తెలిపారు. సంప్రదించినప్పుడు తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.