చెన్నై: సినీ ఇండస్ట్రీని కోవిడ్ దయ లేకుండా కుదుపేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎందరో సినీ ప్రముఖులు తనువు చాలించారు. నిన్నటికి నిన్న బాలీవుడ్ నటి దివ్యభట్నాగర్ కేవలం 34 ఏళ్ల వయస్సులో కరోనాతో తనువు చలించింది. తాజాగా తమిళస్టార్ హీరో శరత్కుమార్ కోవిడ్ బారిన పడ్టట్లు ఆయన భార్య రాధిక ట్వీట్ చేసింది. ‘ హైదరాబాద్లో టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది . అయితే ఎలాంటి లక్షణాలు లేవని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్వీట్ చేసింది’ రాధిక. ప్రస్తుతం ఆయన వైద్యుల సంరక్షణలోనే ఉన్నారని అభిమానులకు తెలిపింది. అయితే శరత్ ఆరోగ్యం పరిస్థితిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేస్తానని చెప్పారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని సోషల్ మీడియా వేదిక రాధిక శరత్కుమార్ పోస్ట్ పెట్టారు.