హైదరాబాద్: అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆయనతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, పలువురు ఎమ్మెల్యేలు, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
అంబేద్కర్ జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తి : సీఎం కేసీఆర్
అంబేద్కర్ జీవితం దేశ ప్రజలకు స్ఫూరినిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం అంబేద్కర్చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.