కాన్బెరా : టీ20లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ ఘన విజయం సాధించింది. కోహ్లీసేన నిర్ధేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చేధించిన క్రమంలో ఆసీస్ జట్టు 150/7 కే పరిమితమైంది. దీంతో భారత్ 11 పరుగులతో బోణీ కొట్టి సిరీస్లో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసిన విషయం తెలిసిందే.