సిడ్నీ: ఆస్ట్రేలియా లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు వరుస ఓటములతో ఆరంభించింది. ఆల్రౌండ్ షోతో ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిధ్య సిరీస్ వరుసగా రెండు వన్డేల్లో నెగ్గి మూడు మ్యాచ్ల సిరీస్ను 2.0తో కైవసం చేసుకుంది. ఆదివారం సిడ్నీ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్పై 51 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (89/87 బంతులలో 7ఫోర్లు ,2 సిక్సర్లు), కేఎల్ రాహూల్ (76/ 66 బంతులలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో భారత్ 9 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు కమిన్స్ 3 /67, హేజిపుల్వుడ్ 2/59, ఆడమ్ జంపా2/62 భారత్ను దెబ్బ కొట్టారు. తొలి వన్డేలో కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే 390 పరుగుల భారీ లక్ష్య చేధనలోబరిలోకి దిగిన భారత్కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు.