మెదక్ జిల్లాలో బోరుబావిలో పడ్డ బాలుడు

 

మెదక్ జిల్లాలో బోరుబావిలో పడ్డ బాలుడు

మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. మూడేళ్ల బాలుడు సాయి వర్ధన్‌ బోరుబావిలో పడ్డాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు సంఘటనస్థలానికి చేరుకుని బోరుబావిలోకి ఆక్సిజన్‌ను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. బోరు బావికి సమాంతరంగా అధికారులు గొయ్యిని తవ్వుతున్నారు. 120 అడుగుల లోతు తవ్వినప్పటికీ నీరు రాలేదని యజమాని వ్యవసాయ బోరు బావిని వృథాగా వదిలేశాడు.

మెదక్ జిల్లాలో బోరుబావిలో పడ్డ బాలుడు