ఏపీ రైతుకు సీఎం కేసీఆర్​ ఫోన్​

ఏపీ రైతుకు సీఎం కేసీఆర్​ ఫోన్​కృష్ణా జిల్లా : కృష్ణాజిల్లా ఘంటసాల మండలం పాలెంకు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు కు తెలంగాణ సీఎం కేసీఆర్​ ఫోన్​ చేశారు. వెద పద్ధతిలో వరిసాగు, దిగుబడులు, సీడ్​ డ్రిల్​ గురించి ప్రసాద్​రావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. కారు పంపుతాననీ తెలంగాణకు వచ్చి వెద పద్ధతిపై రైతులకు అహగాహన కల్పించాలని సీఎం కేసీఆర్​ రైతు ప్రసాద్​రావును కోరారు.